Kangana Ranaut: హీరోయిన్ వింత వ్యాఖ్యలు.. మండిపడుతోన్న నెటిజన్లు!

  • April 8, 2021 / 03:07 PM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్ లను నెటిజన్లు కంగనా మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటూ స్పందిస్తుంటారు. తన గొప్పల గురించి చెప్పుకోవడానికి కంగనా మిగిలిన వాళ్లను తక్కువ చేస్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ట్వీట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘తలైవి’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాలో తన నటనకు ప్రశంసలు అందుతున్నాయని కంగనా చెప్పుకొచ్చింది.

తన నటనను ప్రశంసిస్తూ స్టార్ హీరోలు ఫోన్లు చేస్తున్నారని చెబుతోంది. ఇందులో వింతేమీ లేదు కానీ.. సదరు నటులు ఈమెకి సీక్రెట్ గా ఫోన్ చేస్తున్నారట. ఒక హీరోయిన్ నటనను అభిమానందించడం వెనుక అంత రహస్యంగా ఫోన్ ఎందుకు చేస్తారనే విషయంలో కంగనా క్లారిటీ ఇచ్చింది. బహిరంగంగా తన నటనను ప్రశంసిస్తే సదరు హీరోలకు బాలీవుడ్ మాఫియా నుండి ప్రమాదం ఉంటుందట. అందుకే వారు రహస్యంగా ఫోన్లు చేసి తనను అభినందిస్తున్నారట. ఇది కంగనా వెర్షన్. ఇలా రహస్యంగా ఫోన్లు చేసి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారట.

అలియా భట్, దీపికా వంటి వారికి కోపం వస్తుందని.. బాలీవుడ్ మాఫియాతో ముప్పు అని.. అందుకే అక్షయ్ తో సహా పలువురు బాలీవుడ్ సార్లు రహస్యంగా ఫోన్లు చేసి అభినందించారని కంగనా చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కంగనాను ట్రోల్ చేస్తున్నారు. తన గొప్ప చెప్పుకోవడానికి కంగనా చాలా తిప్పలు పడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే రేంజ్ లో ఉన్నారని.. అలాంటి వ్యక్తి రహస్యంగా, ఎవరికో భయపడి సీక్రెట్ గా ఫోన్ చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus