నాగచైతన్య హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది!

  • July 16, 2016 / 01:23 PM IST

ప్రముఖ సీనియర్ నటీమణి రాధ కుమార్తెగా నాగచైతన్య సరసన “జోష్” సినిమాతో వెండితెరకు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే.. టైటిల్ లో ఉన్న “జోష్” సినిమాలో లేకపోవడంతో సినిమా ఫ్లాపవ్వడంతోపాటు హీరోయిన్ గా కార్తీకకు ఎటువంటి పేరు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత ఎన్టీయార్ “దమ్ము” చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి అందాలు ఆరబోసినా ఫలితం శూన్యం. దాంతో తమిళనాడుకుపోయి అక్కడ “కో” (తెలుగులో “రంగం”) అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.

అయితే.. హీరోయిన్ గా మాత్రం కార్తీక కెరీర్ కు ఆ హిట్ ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు.
మరి హీరోయిన్ గా నటించే ఓపిక లేదో.. లేక తనను ఎవరూ గుర్తించారని ఫిక్స్ అయిపోయిందో తెలియదు కానీ.. సినిమాలకు “గుడ్ బై” చెప్పేయాలని ఫిక్సయిపోయిందట కార్తీక. అయితే.. సినిమాకు దూరమైనా సీరియన్స్ లో బుల్లితెర వీక్షకులను పలకరిస్తానంటుంది. ఈవిడగారికి హిందీ సీరియల్ లో అవకాశం వచ్చింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus