బాలీవుడ్ లో అడుగుపెడుతున్న యంగ్ హీరో..!

  • February 24, 2021 / 07:38 PM IST

చావు కబురు చల్లగా అంటూ సినిమా చేసిన హీరో కార్తీకేయ చల్లగా బాలీవుడ్ లో కూడా పాగా వేయబోతున్నాడా అంటే నిజమే అంటున్నారు ఫిలింనగర్ తమ్ముళ్లు. మేటర్ ఏంటంటే., ఆర్ ఎక్స్ 100, గ్యాంగ్ లీడర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత గుణ 369, 90 ఎమ్ ఎల్ సినిమాలతో హీరోగా శభాష్ అనిపించుకున్న కార్తీకేయ ప్రస్తుతం చావుకబురు చల్లగా సినిమా లో చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా తమిళంలో అజిత్ నటిస్తున్న సినిమా వాలిమై లో యాక్ట్ చేస్తున్నాడు.

ఈసినిమాని బాలీవుడ్ నిర్మతా బోనీకపూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో కార్తీకేయ యాక్టింగ్ కి ఫిదా అయిన బోనీకపూర్ రెండు వరస సినిమాలకి హీరోగా కార్తీకేయకి అడ్వాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. అంతేకాదు, ఈసినిమాలని తెలుగులో ఇంకా హిందీలో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. దీంతో కార్తీకేయకి ఒక్కసారిగా బంపర్ ఆఫర్ తగిలినట్లుగా అయ్యింది. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా తనని తాను ప్రూవ్ చేస్కోవాలి అనుకుంటున్న టైమ్ లో కార్తీకేయకి ఇలాంటి ఆఫర్ రావడం నిజంగా అదృష్టమని చెప్తున్నారు అందరూ.

ఇక తెలుగులో నిర్మించే ఈ సినిమాలని ప్యాన్ ఇండియా రేంజ్ లో స్టోరీలని సెట్ చేస్తున్నారట. ప్రస్తుతం బోనీకపూర్ ఇదే పనిలో ఉన్నారని ఎలాగైనా సరే తన మార్క్ ని టాలీవుడ్ లో మరోసారి చూపించాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బోనీ కపూర్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరో కార్తికేయని ఏ రేంజ్ లో వాడుకుంటాడు అనేది చూడాలి. అదీ మేటర్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus