కళాభవన్ మృతిపై సి‌బి‌ఐ విచారణ..!

  • June 13, 2016 / 08:58 AM IST

మలయాళీ నటుడు కళాభవన్ మణి మృతి కేసు విచారణను సి‌బి‌ఐ కు అప్పగిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మృతికేసులో పలు చిక్కులు ఉన్నందున ఈ కేసును సి‌బి‌ఐ అప్పగించాలన్న డి‌జి‌పి లోక్ నాథ్ బెహెరా సూచన మేరకు ఈ కేసును సి‌బి‌ఐకి అప్పగిస్తున్నట్లు కేరళ హోం సెక్రటరీ స్పష్టం చేసింది.

మరోవైపు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన పినరై విజయన్ ను వారం రోజుల క్రితం కలిసిన మణి సోదరుడు ఆర్‌ఎల్‌వి రామకృష్ణన్ ఈ కేసును సి‌బి‌ఐ కి అప్పగించాలని కోరాడు. కాగా మార్చి 6 న త్రిస్సూర్ లో మణి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఆయన మృతి సహజమైంది కాదని..

ఆయన తీసుకున్న మద్యంలో హానికారక విష పూరితమైన క్రిమిసంహారక మందులు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది. మణి స్నేహితులే మణి మృతికి కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus