పవన్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటి

  • December 28, 2016 / 09:18 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ ఆర్టిస్టులు,  టేక్నీషియన్ల ఎంపిక పూర్తి చేశారు. కొన్ని రోజుల క్రితం సంగీత దర్శకుడుగా అనిరుద్ ని ఫిక్స్ చేయగా, కెమెరామెన్ గా ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని ఖరారు చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికలుగా నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ ని తీసుకున్నారు. తాజాగా ఇందులో ఓ కీలక పాత్రకు సీనియర్ నటి ఖుష్బూ ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె ఈరోజు వెల్లడించారు.

“త్రివిక్రమ్ వినిపించిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. నా పాత్ర చాలా బాగుంది. అభిమానులను నిరుత్సాహ పరచకుండా, పాత్రకి న్యాయం చేయడానికి కృషి చేస్తాను.” అని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు. మరో ట్వీట్ లో “దాదాపు 9 సంవత్సరాల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాను. తెలుగులో నా చివరి సినిమా ‘స్టాలిన్’. చిరంజీవితో చేసిన ఇంత కాలానికి ఆయన తమ్ముడు పవన్ తో చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది” అని సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో “కాటమరాయుడు” చిత్రీకరణలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ చిత్రాన్ని జనవరి పూర్తి చేసి, ఫిబ్రవరి నుంచి త్రివిక్రమ్ సినిమా కోసం పనిచేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus