మహేష్ 24 సినిమాకి అదే సెంటిమెంట్ ని ఫాలో అయిన కొరటాల శివ

  • May 8, 2017 / 08:02 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివతో సినిమాని మొదలెట్టనున్నారు. అందుకే డైరక్టర్ పక్కాగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. ఆయన గత చిత్రాలకు పాటించిన సెంటిమెంట్ ని ఈ చిత్రానికి ఫాలో అయ్యారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ స్క్రిప్ట్ లను తిరుమల వేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. అవి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ తో చేయనున్న మూవీ స్క్రిప్ట్ ని కూడా శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఈ నెల మూడవతేదీన తిరుమలకు వెళ్లిన ఆయన శ్రీవారిని దర్శించుకొని పూజ పూర్తిచేసినట్లు తెలిసింది.

అందుకే శ్రీమంతుడి కంటే గొప్ప హిట్ ని మహేష్ కి ఇస్తానని కొరటాల శివ ధీమాగా చెబుతున్నారు. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకి ఇప్పటికే మూడు పాటలను రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. మహేష్ 24 మూవీకి “భరత్ అను నేను” అని పేరుని కూడా ఫిక్స్ చేసేసారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో లండన్ నుంచి ఇండియాకి వచ్చిన ఎన్నారై పాత్రలో మహేష్ కనిపించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus