Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Advertisement

మలయాళ సినిమా పరిశ్రమలోనే కాదు.. మొత్తం ఇండియన్‌ సినిమాలో ఓ సంచలనం ‘లోక: చాప్టర్‌ 1 చంద్ర’. కల్యాణి ప్రియదర్శన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలై రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఓ సూపర్‌ ‘హీరో’యిన్‌ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. అందుకే ఈ సినిమా గురించి ఇప్పటికీ ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా పేరులోనే చాప్టర్‌ 1 ఉంది కాబట్టి.. చాప్టర్‌ 2 కచ్చితంగా ఉంటుంది. అందులోనూ సినిమా హిట్‌ అయింది.

Kotha Lokah 2

డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వంలోనే ‘లోక: చాప్టర్‌ 2’ (తెలుగులో కొత్తలోక: చాప్టర్‌ 2) తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి ఇటీవల కల్యాణి ప్రియదర్శన్‌ మాట్లాడింది. ప్రస్తుతం ‘లోక: చాప్టర్‌ 2’ సినిమా స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబరు నుండి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. నేను ఈ సినిమాలో భాగమవుతున్నాను. తిరిగి నా సూపర్ ‘హీరో’యిన్‌ పాత్రను పోషిస్తున్నాను అని చెప్పింది కల్యాణి. ఇందులో ప్రధాన పాత్రధారులు రిపీట్‌ అవుతున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ కూడా కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమా దుల్కర్‌ సల్మాన్‌ నిర్మాణంలోనే రూపొందుతోందనే విషయం తెలిసిందే. తొలి సినిమా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు రెండో పార్టును అన్ని భారతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే తొలి పార్టు కాస్త లేట్‌గా ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్‌ చేశారు. ఇప్పుడు ఒకే సమయంలో అన్ని భాషల్లో విడుదల చేస్తారు.

తొలి సినిమా కథకు ఇది కొనసాగింపుగా ఉంటుందా? లేక వేరేకథను తీసుకొని అదే లైన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది చూడాలి. ఏదేమైనా మాలీవుడ్‌లో మరో భారీ వసూళ్ల సినిమా లోడింగ్‌ అవుతోంది.

: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read