Krithi Shetty: ది వారియర్ కథ వినగానే ఆ జ్ఞాపకాలన్ని గుర్తుకు వచ్చాయి!

  • July 6, 2022 / 01:15 PM IST

ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ విధంగా ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్.. బంగార్రాజు వంటి సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.ఇక ప్రస్తుతం ఈమె లింగు స్వామి దర్శకత్వంలో నటించిన దివారియర్ సినిమా ఈనెల 14వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి ఈ సినిమా గురించి అలాగే తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో వచ్చే సినిమాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని ఈమె పేర్కొన్నారు.ఆవారా సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సినిమాని రోజుకు రెండు మూడు సార్లు చూసే దాన్ని అని ఈమె తెలిపారు.

లింగు స్వామి గారి దగ్గర నుంచి తనకు ఫోన్ వచ్చిందని అమ్మ చెప్పగానే తనకు ఈ జ్ఞాపకాలని గుర్తొచ్చాయని ఈ సందర్భంగా కృతి శెట్టి పేర్కొన్నారు. ఇకపోతే ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలలో నటించాలని అనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించగా తనకు యాక్షన్ సినిమాలలో నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె తన మనసులో మాటను బయటపెట్టారు.

ది వారియర్ సినిమాలో తాను మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తానని ఈ సినిమాలో తాను ఒక రేడియో జాకీ. ఈ క్యారెక్టర్‌ వింటున్నప్పుడు మంచి ఫీలింగ్‌ కలిగింది. ప్రేక్షకులలో కూడా అదే ఫీలింగ్ కలుగుతుందని సినిమా చూస్తున్నంత సేపు తన పాత్రను ఒక పక్కింటి అమ్మాయిలా ఫీల్ అవుతారని కృతి శెట్టి వెల్లడించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ కృతి శెట్టి దివారియర్ సినిమా గురించి వెల్లడించారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus