చిక్కుల్లో పడ్డ సీనియర్ స్టార్ హీరోయిన్… ట్రోలింగ్ షురూ.!

  • June 30, 2024 / 03:34 PM IST

సోషల్ మీడియాలో నెటిజన్ల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం దొరికినా వాళ్ళ ట్రోలింగ్ మామూలుగా ఉండదు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఇలాంటి ట్రోలింగ్ నే ఎదుర్కొంటుంది. ఆమె మరెవరో కాదు సీనియర్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ (Madhuri Dixit). వివరాల్లోకి వెళితే.. ఈమె ఓ కంపెనీ తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోషన్ చేసేందుకు ఒప్పుకుంది. అదే ఈమె పాలిట శాపంగా మారింది. మరింత డీప్ గా వెళ్తే..

రెహన్ సిద్ధిఖీ అనే అమెరికన్ బిజినెస్మెన్ ఆగస్టులో తన కంపెనీల ప్రమోషన్ కోసం ఓ భారీ ఈవెంట్ ని టెక్సాస్ లో ప్లాన్ చేశాడు. దీనిని ప్రచారం చేసేందుకు మాధురీ దీక్షిత్ అంగీకరించింది. అయితే రెహన్ సిద్ధిఖీ పాకిస్తాన్ సంతతికి చెందిన ISI లతో సంబంధాలు కలిగి ఉన్నాడు. దీంతో అతని బిజినెస్ లు బ్లాక్ లిస్ట్ లో పడ్డాయి. అలాంటి వ్యక్తి బిజినెస్ లను మాధురి దీక్షిత్ ప్రమోట్ చేయడానికి అంగీకరించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఐఎస్ఐ తో సంబంధం ఉన్న వ్యక్తి వ్యాపారాలను ప్రమోట్ చేయడానికి నువ్వు రంగంలోకి దిగడం ఏంటి? డబ్బు మీద పిచ్చి ఎక్కువైందా? నువ్వు అసలు ఇండియన్ వేనా?’ అంటూ ఆమె పై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. అయితే ఈ విమర్శల గురించి కానీ, ఈ విషయం గురించి కానీ మాధురీ దీక్షిత్ ఇంకా స్పందించి క్లారిటీ ఇచ్చింది లేదు. ఆమె అభిమానులు సైతం ఆమెను విమర్శిస్తున్నా ఎందుకో సైలెంట్ గానే ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus