క్యాన్సిల్ చేయాలి కానీ.. పోస్ట్ చేయడమేంటి బుద్దిలేకుండా

మహేష్ బాబుకు మాతృ సమానమైన విజయ నిర్మల చనిపోయిన కారణంగా ఘట్టమనేని కుటుంబ సభ్యులతోపాటు వారి అభిమానులు కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ కారణంగా రేపు సాయంత్రం నిర్వహించాలనే ప్లానింగ్ ఉన్నప్పటికీ.. విజయ నిర్మల ఆకస్మిక మరణం కారణంగా ఆ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు. అయితే.. కొద్దిసేపటి తర్వాత స్పందించిన దిల్ రాజు ఈవెంట్ క్యాన్సిల్ చేయలేదని కేవలం పోస్ట్ పోన్ చేశారని స్పెష్టం చేశారు. దాంతో మహేష్ బాబు మరియు కృష్ణ అభిమానులందరూ ఒక్కసారిగా దిల్ రాజుపై ఫైర్ అవ్వడం మొదలెట్టారు.

అక్కడ తల్లి చనిపోయి ఘట్టమనేని కుటుంబం బాధపడుతుంటే.. ఈవెంట్ ను క్యాన్సిల్ చేయకుండా సింపుల్ గా పోస్ట్ పోన్ చేయడం ఏమిటి? ఈ బాధాకరమైన విషయం నుంచి బయటపడడానికే మహేష్ & ఫ్యామిలీకి చాలా సమయం పడుతుంది. ఇలాంటి తరుణంలో “సెలబ్రేటింగ్ మహర్షి” అంటూ మహర్షి 50 డేస్ ఫంక్షన్ ను ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఆ ఈవెంట్ కి వచ్చిన మహేష్ & ఫ్యామిలీ అందరి ముందు ఎలా నవ్వగలుగుతారు? అని ట్విట్టర్ లో దిల్ రాజుపై నిప్పులు చెరుగుతున్నారు మహేష్ ఫ్యాన్స్. మరి ఈ విషయాన్ని దిల్ రాజు కన్సిడర్ చేసి.. ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus