స్పైడర్, భరత్ అనే నేను చిత్రాలతో తీరికలేకున్న మహేష్ బాబు

  • August 1, 2017 / 05:48 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ హడావుడి పడరు. పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తుంటారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా అనే రీతిలో వెళుతుంటారు. కానీ తొలి సారి రెండు సినిమాలను ఒకే సమయంలో హ్యాండిల్ చేస్తున్నారు. స్పైడర్, భరత్ అనే నేను సినిమా పనులతో బిజీగా ఉన్నారు. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి మహేష్ డబ్బింగ్ చెబుతున్నారు. తమిళ వెర్షన్ కి కూడా స్వయంగా మహేషే చెబుతుండడం విశేషం. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో వేసిన అసెంబ్లీ సెట్ లో జరుగుతోంది.

ఈ చిత్రీకరణలో పగలు పాల్గొంటున్న మహేష్ .. పేకప్ చెప్పగానే డబ్బింగ్ స్టూడియోకి వెళుతున్నారు. విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు. బ్రహ్మోత్సవం తర్వాత చాలా గ్యాప్ రావడంతో ఎలాగైనా సెప్టెంబర్ 27 న స్పైడర్ మూవీ రిలీజ్ చేయాలనీ సంకల్పంతో పనిచేస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. శ్రీమంతుడు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భరత్ అనే నేను సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus