భరత్ అను నేను సినిమా రిలీజ్ తేదీలో మార్పు!

  • December 5, 2017 / 10:51 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుల హీరో మాత్రమే కాదు.. నిర్మాతల హీరో అని మరోసారి చాటుకున్నారు.  సెట్స్ లో దర్శకుల మాటకు నో చెప్పని మహేష్.. తన నిర్మాతలను ఆదుకోవడంలోనూ ముందుంటారు. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను  ఏప్రిల్ 27 న విడుదల చేస్తామని నెల క్రితమే ప్రకటించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న నా పేరు సూర్య  సినిమాని కూడా అదే తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడంలో పెద్ద ఇబ్బంది ఉండదనుకున్నారు.

కానీ రజనీకాంత్, శంకర్ కలయికలో తెరకెక్కుతోన్న 2 . o చిత్రాన్ని ఏప్రిల్ 27 రిలీజ్ చేస్తున్నట్లు లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం నిన్న ప్రకటించారు. దీంతో దానయ్య ఆలోచనలో పడ్డారు. మూడు సినిమాలు ఒకే రోజు వస్తే కలక్షన్లపై ప్రభావం కనిపిస్తుంది. ఇదే అభిప్రాయాన్ని మహేష్ ముందు ఉంచగా.. అయన ఎటువంటి ఈగోలకు పోకుండా రెండు వారలు ముందుగా రిలీజ్ చేయమని సూచించినట్లు ఫిలిం నగర్ వాసులు తెలిపారు. మహేష్ చెప్పినట్లుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని  పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను కూడా వేగవంతం చేశారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు.  శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న భరత్ అనే నేను సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus