మహేష్ ని కొత్తగా చూపిస్తాను : మురుగ దాస్

  • September 10, 2016 / 07:59 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గత చిత్రం బ్రహ్మోత్సవం ఆశించినత విజయం సాధించక పోవడంతో అయన అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. కమర్షియల్ డైరక్టర్ ఏఆర్ మురుగ దాస్ ఎలా తీస్తున్నాడోనని కొంత కంగారుగా పడుతున్నారు. అయితే వారి భయాలన్నింటినీ ఈ డైరక్టర్ పోగొట్టారు. “మహేష్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో సినిమాలో ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇప్పటికీ నెరవేరింది. ప్రిన్స్ ని ఈ సినిమాలో ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా కొత్తగా చూస్తారు” అని మురుగ దాస్ చెప్పారు. అభిమానులు గర్వించదగ్గ సినిమా అవుతుందని స్పష్టం చేశారు. అయన మాటలు మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి.

ఎం.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మూడు రోజుల క్రితం చెన్నైలో ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ చిత్రీకరణలో మహేష్, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, తమిళ నటుడు ఆర్జే బాలాజీ తో పాటు ప్రియదర్శి పాల్గొంటున్నారు. వీరిపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus