Manchu Vishnu: ప్రభాస్, బాలయ్య గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • March 24, 2024 / 02:37 PM IST

మంచు విష్ణు (Manchu Vishnu) క ఒకవైపు సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. మరోవైపు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. మా అసోసియేషన్ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ మలేషియాలో నవతి పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈవెంట్ చేయనున్నట్టు వెల్లడించారు. జులై నెలలో ఈ ఈవెంట్ జరుగుతుందని మంచు విష్ణు వెల్లడించడం గమనార్హం. జులై నెలలో మూడు రోజుల పాటు షూటింగ్ లకు సెలవులు ఇవ్వాలని విష్ణు అన్నారు.

చిరంజీవికి (Chiranjeevi)  పద్మ విభూషణ్ రావడం గర్వించదగిన విషయం అని ఆయన తెలిపారు. భారతీయ సినిమాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృషి చేసిందని విష్ణు పేర్కొన్నారు. బన్నీకి (Allu Arjun) కేరళలో అక్కడ స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఉందని ఆయన వెల్లడించడం గమనార్హం. ప్రభాస్ (Prabhas) మన దేశంలోనే హైయెస్ట్ పైడ్ నటుడు అని విష్ణు పేర్కొన్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎన్నో దేశాల్లో ఎదురుచూసేవాళ్లు ఉన్నారని ఆయన వెల్లడించారు.

మహేష్ (Mahesh)  జక్కన్న (Rajamouli)  కాంబో మూవీ బడ్జెట్ పరంగా ఇండియాలోనే పెద్ద మూవీ అని విష్ణు వెల్లడించారు. జై బాలయ్య (Balayya) అనే మాట ఎంత పాపులర్ అంటూ మంచు విష్ణు కామెంట్లు చేయడం గమనార్హం. తెలుగు సినిమాకు ప్రస్తుతం గోల్డెన్ ఎరా నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఐదు అసోసియేషన్లతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒప్పందం చేసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. నవతి ఈవెంట్ ద్వారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫండ్ రైజ్ చేయనున్నామని మంచు విష్ణు వెల్లడించారు.

ఇతర భాషా సినిమా ఇండస్ట్రీల నుంచి కూడా సపోర్ట్ ఉందని ఆయన అన్నారు. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదల కానుంది.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus