బెడ్ రూమ్ సీన్స్ పై ‘మంగళవారం’ నటి బోల్డ్ కామెంట్స్

  • April 29, 2024 / 10:11 PM IST

‘మంగళవారం’ (Mangalavaaram) సినిమాలో జమిందార్ భార్య పాత్రని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. క్లైమాక్స్ లో ఆ పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది మరి. మొదటి నుండి ఆ పాత్ర చాలా గొప్పది అన్నట్టు చూపించి క్లైమాక్స్ లో ఆమె అసలు రూపాన్ని రివీల్ చేస్తాడు దర్శకుడు. అయితే ఆ రాజేశ్వరి దేవి అనే పాత్రని చేసిన నటిని మాత్రం అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆమె పేరు దివ్య పిళ్ళై (Divya Pillai). ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం నాగ చైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ (Thandel) మూవీలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోల్డ్ సీన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. దివ్య పిళ్ళై మాట్లాడుతూ.. “రొమాంటిక్ సీన్స్ అనగానే ఇద్దరు ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడం మాత్రమే కదా అని అంతా అనుకుంటారు. కానీ, సెట్స్‌లో అందరిముందు అలాంటి సీన్స్ లో నటించడం అనేది ఈజీ మేటర్ కాదు.

కారణం కూడా నేను చెబుతాను. సుమారు 75 కేజీల బరువు ఉన్న ఓ మనిషి మనపై పడుకుని ఉన్నప్పుడు కెమెరాకి దర్శకుడు కావాలనుకునే ఎక్స్ప్రెషన్స్ పలికించడం సాధ్యమేనా.? అది చిన్న విషయం కాదు. ఆ టైంలో మైండ్లో వేరే ఆలోచన ఉండదు.ముద్దు సన్నివేశాల్లో కూడా.. ముద్దుని ఎంజాయ్ చేయడం వంటిది ఏమీ ఉండదు.

ఇప్పుడు మీరే ఆలోచించండి.రొమాంటిక్ సన్నివేశాల కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో.! ఎవరితో అయితే రొమాంటిక్ సీన్స్ చేయాలో..ఆ సహ నటుడితో ముద్దు సీన్ కోసం కూడా డిస్కస్ చేసుకోవాలి. ఆ సీన్ ఇబ్బందిగా అనిపించినా ఎక్స్ప్రెషన్ మార్చకూడదు” అంటూ చాలా బోల్డ్ గా వివరించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus