‘మహర్షి’ చిత్రంలో తన పాత్ర పై క్లారిటీ ఇచ్చిన ‘దూకుడు’ భామ ..!

  • March 26, 2019 / 12:44 PM IST

మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 9 న విడుదల కాబోతుంది. ‘దూకుడు’ ‘బాద్ షా’ వంటి చిత్రాల్లో టైటిల్ సాంగ్స్ లో నర్తించిన బాలీవుడ్ నటి మీనాక్షి దీక్షిత్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుందని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై తాజాగా మీనాక్షి క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ… “ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో మహేష్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్నాను. న్యూయార్క్ ఎపిసోడ్ లో ఈ సన్నివేశాలు ఉంటాయి. నాకు మహేష్ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తాయి. మహేష్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ‘మహర్షి’ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దిల్ రాజు,అశ్వినీ దత్,పొట్లూరి వి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus