మహేష్ బాబు సరసన నటించే ఆఫర్ దక్కించుకున్న మీనాక్షీ!

  • December 10, 2018 / 01:22 PM IST

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ మహర్షి. మహేష్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా మరో యంగ్ హీరోయిన్ సినిమాలో నటిస్తుందని తెలిసింది. మహేష్ బాబు కెరీర్ లో ఒన్నాఫ్ ది బెస్ట్ హిట్ అయిన “దూకుడు” సినిమాలో ఐటెమ్ సాంగ్ లో మెరిసిన మీనాక్షీ దీక్షిత్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈమేరకు మీనాక్షీ ఆల్రెడీ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఎన్నారైగా ఆమె సినిమాలో కనిపించనుంది.

మహేష్ సినిమాలో ఆఫర్ రావడంపై మీనాక్షి తెగ సంబరపడుతుంది. తెలుగులో సత్తా చాటేందుకు తనకు ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుందని భావిస్తుంది మీనాక్షి. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పూజాతో పాటుగా మీనాక్షి మెరుపులు ఈ సినిమాకు ప్లస్ అవనున్నాయి. 2019 ఏప్రిల్ 5 ఉగాది సందర్భంగా మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus