బాహుబలి 2 పోస్టర్ లో రాజమౌళి ఆ తప్పు ఎందుకు చేశారు ?

  • January 30, 2017 / 08:01 AM IST

దర్శకత్వంలో పర్ఫెక్షన్ కి మారు పేరు ఎస్.ఎస్. రాజమౌళి. ఈ దర్శకధీరుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా  ప్రతి సినిమాని, కాదు.. కాదు.. ప్రతి ఫ్రేమ్ ని పెయింటింగ్ లా చెక్కుతుంటారు. అందుకే జక్కన్నగా కీర్తి గాంచారు. ఇప్పుడు ఈయనపై ఓ విమర్శ సోషల్ మీడియాలో వీర విహారం చేస్తోంది. అది ఏమిటంటే..  గణతంత్ర దినోత్సవం రోజున బాహుబలి కంక్లూజన్ కి సంబంధించిన రెండో పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో అమరేంద్ర బాహుబలి(ప్రభాస్‌)తో దేవసేన(అనుష్క) విల్లు పట్టుకొని బాణాలను గురిచూస్తున్న ఫోజు అందరినీ ఆకట్టుకుంది. ఈ స్టిల్ లో దారుణమైన తప్పుచేసి రాజమౌళి విమర్శకులకు మంచి పాయింట్ అందించారు. ఇందులో అనుష్క, ప్రభాస్ విడివిడిగా విల్లు పట్టుకుని మూడు బాణాలను ఎక్కుపెట్టారు.

ప్రభాస్ బాణాలు మూడింటిలో రెండు అనుష్క విల్లులో నుంచి వస్తున్నాయి. అలా బాణాలను వేయడానికి ప్రయత్నిస్తే ఇబ్బందులు వస్తాయి. అటువంటప్పుడు ఆ స్టిల్ ఎందుకు పెట్టారు ? అంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇది ముమ్మాటికీ పోస్టర్ మేకింగ్ లో జరిగిన పెద్ద మిస్టేక్ గా చెబుతున్నారు. అది కూడా  చూసుకోకుండా జక్కన రిలీజ్ చేసారంటూ విమర్శిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. మరి రాజమౌళి దీనిపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus