బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం అంత సమయమా ?

  • July 3, 2018 / 01:05 PM IST

కార్తికేయ సినిమాతో చందు మొండేటి ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేశారు. ఆ తర్వాత ప్రేమమ్ తో ప్రేమలో పడేసాడు. ఇప్పడు అదే హీరో.. అంటే నాగచైతన్యతోనే సవ్యసాచి తో ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ప్రీ లుక్ తోనే ఆసక్తి రేపింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయింది. పదిరోజుల పాటు ప్యాచ్ వర్క్ చేస్తే ప్రొడక్షన్ కి గుమ్మడికాయ కొట్టేయవచ్చు. మాధవన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో భూమిక కీలకరోల్ పోషించింది. ఈ చిత్రాన్ని నాగార్జున పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ కాకముందే చూసేశారని సమాచారం. బాగుందని చిత్ర బృందాన్ని అభినందించారని టాక్.

అయితే ఈ సినిమాని వేగంగా రిలీజ్ చేయాలనీ అనుకున్నారట. కానీ తొందరగా కుదరదని తేలింది. ఎందుకంటే ఈ చిత్రానికి కీరవాణి నేపథ్యసంగీతాన్ని అందించాల్సి ఉంది. అతను దాదాపు మూడు వారాలకు పైగా అవసరం అని చెప్పారంటా. చైతూ ప్యాచ్ వర్క్ పూర్తి చేసి.. వాటిని సినిమాకి జోడించి కీరవాణికి అందించేసరికి మరో 20 రోజులు పడుతుంది. కాబట్టి సినిమాని ఆగస్టు 17వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అప్పటివరకు అభిమానులను నిరుత్సాహపరచకుండా ఉండేందుకు ఈ నెల 8వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus