Mohan Babu: ట్రోలింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు!

  • February 17, 2022 / 03:19 PM IST

2000 సంవత్సరం వరకు మంచు మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత కాలంలో మోహన్ బాబు నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కాగా మోహన్ బాబు సైతం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా రేపు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాకు పరవాలేదనే స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మోహన్ బాబు గురించి, మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Click Here To Watch

మీమ్స్, ట్రోలింగ్ గురించి తాజాగా మోహన్ బాబు స్పందిస్తూ వ్యంగ్యంగా ఉండే మీమ్స్, ట్రోలింగ్ ను చూసి బాధ పడుతున్నానని మనిషిగా పుట్టినందుకు ఆత్మాభిమానం ఉంటుందని కొన్ని విషయాలలో బాధ పడక తప్పదని మోహన్ బాబు కామెంట్లు చేశారు. ఇద్దరు హీరోలు 100 మందిని అపాయింట్ చేసుకుని మిగతా హీరోలను ట్రోల్ చేయిస్తున్నారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఆ హీరోలు ఎవరనే విషయం తనకు తెలుసని వినాశకాలే విపరీతబుద్ధి అని మోహన్ బాబు కామెంట్లు చేశారు.

తాత్కాలికంగా వాళ్లు సంతోషంగా ఉన్నా ఏదో ఒకరోజు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ప్రకృతి చూస్తోందని ఏదో ఒకరోజు వాళ్లు శిక్ష అనుభవిస్తారని వాళ్లకు ఎవరూ సాయపడరని మోహన్ బాబు కామెంట్లు చేశారు. సరదాగా నవ్వుకునే విధంగా ట్రోల్స్, మీమ్స్ ఉండాలే తప్ప ఎదుటి మనిషిని బాధ పెట్టే విధంగా ఉండకూడదని మోహన్ బాబు వెల్లడించారు. మోహన్ బాబు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

అయితే మోహన్ బాబు ఫ్యామిలీని టార్గెట్ చేసి ట్రోల్స్ చేయించిన వాళ్లెవరో తెలియాల్సి ఉంది. సన్నాఫ్ ఇండియా సినిమాతో మోహన్ బాబు సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి. ఓటీటీ కోసం తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus