షూటింగ్‌లో ఎస్పీబీకి నివాళులు అర్పించిన విజయ్ సేతుపతి.. నటకిరీటి

  • September 28, 2020 / 12:16 PM IST

సంగీత సరస్వతి ముద్దుబిడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిష్క్రమణం సంగీతాభిమానులకు అంతులేని శోక సంద్రాన్ని మిగిల్చింది. తాము విన్న ఎస్పీబీ మరణవార్త నిజం కాకూడదని కోరుకుంటున్నారు. నమ్మక తప్పని నిజం కావడంతో ఎస్పీబీ లేకున్నా ఆయన పాటలు మనతో ఉన్నాయని మనసుకు సర్ది చెప్పుకొంటున్నారు. ఆయన పాటలను, మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’లో రాజా పాండి క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న ఒక సినిమా షూటింగ్ ప్రజెంట్ జైపూర్‌లో జరుగుతోంది. ఎస్పీబీ కడచూపుకు నోచుకోని ఆ సినిమా యూనిట్ వున్న చోటు నుండి ఎస్పీబీకి నివాళులు అర్పించారు. ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఆయన కూడా అక్కడే ఉన్నారు. రాధికా శరత్ కుమార్, సురేఖ తదితరులు సైతం ఈ సినిమా షూటింగ్ నిమిత్తం జైపూర్ లో వున్నారు.

తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీబీ అంత్యక్రియలు శనివారం తమిళనాడులోని చెన్నైలో గల ఆయన ఫామ్ హౌస్ లో హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. తమిళ నటుడు విజయ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో తక్కువ మంది మాత్రమే వెళ్లారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus