అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ టీజర్

  • January 3, 2019 / 06:07 AM IST

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ టీజర్‌లోని అఖిల్ స్టెప్స్, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే ‘మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినపుడు మీరేం చేసేవారు?’ అంటూ అఖిల్ అడిగిన ప్రశ్నకు ‘చాక్లెట్ తినేదాన్ని’ అని ఓ అమ్మాయి చెప్పిన సమాధానానికి అఖిల్ ‘ఆరోజుల్లో చాక్లెట్స్‌తో పనైపోయేది.

కానీ, టుడేస్ స్ట్రెస్ లెవల్స్‌కి హ్యూమన్ టచ్ కావాలి, ‘ప్రపంచంలోని అందరమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నిక్కీ. వాళ్ళకీ ఓ లైఫ్ ఉంటుంది. అండ్ ఐ రెస్పెక్ట్ దట్’’ అంటూ అఖిల్ అక్కినేని చెప్పే డైలాగ్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా యూత్‌ఫుల్‌గా ఉంది. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus