చైతూ ఇక సామ్ ను తాకుతూనే ఉండిపోతాడేమో!

  • July 23, 2018 / 07:36 AM IST

హీరో హీరోయిన్లన్నాక కమర్షియల్ యాడ్స్ లో నటించడం అనేది సర్వసాధారణం. హీరో/హీరోయిన్ స్టార్ ఇమేజ్ ను బట్టి సంస్థలు తమ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించమని కోరుతుంటాయి. అయితే.. పెళ్ళికి ముందు నాగచైతన్య-సమంత కలిసి ఒక్క యాడ్ కూడా చేయని నాగచైతన్య-సమంతలు.. పెళ్లి తర్వాత మాత్రం వరుసబెట్టి కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. మొన్నామధ్య ఈ ఇద్దరు కలిసి చేసిన “బిగ్ బజార్” యాడ్ బాగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఈ జంటను జంటగా చిత్రీకరిస్తూ తీసే యాడ్ కి క్రేజ్ అమాంతం పెరిగింది.

ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. అందులో భాగంగానే నాగచైతన్య-సమంతలతో “రెక్సోనా” సంస్థ ఒక యాడ్ ను షూట్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తున్న చైసామ్ ఫ్యాన్స్ మాత్రం “ఇకపై చైతన్య సమంతను తాకుతూనే ఉండిపోతాడేమో” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట పెళ్లి అనంతరం నటించబోయే తొలి చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus