నాగచైతన్య సినిమాకి తప్పని తిప్పలు

  • June 9, 2018 / 05:51 AM IST

చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమాకి రీషూట్ జరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే.. పేపర్ మీద రాసుకున్న సన్నివేశం తెరమీదకు వచ్చేసరికి ఒక్కోసారి రాసుకొన్నదానికంటే అద్భుతంగా వస్తే.. ఇంకోసారి సరిగా రాకపోవచ్చు. అందుకే ఫస్ట్ కాపీ చూసుకున్నాక బాగా రాలేదు అనుకొన్న సన్నివేశాల్ని రీషూట్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం “సవ్యసాచి” విషయంలోనూ అదే జరుగుతోంది. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 12న విడుదల తేదీని ప్రకటించబడి ఆ సన్నాహాల్లో ఉంది.

అయితే.. ఇటీవల సినిమా ఫస్ట్ కాపీ చూసుకొన్న దర్శకనిర్మాతలకు కొన్ని సన్నివేశాలు ఊహించిన స్థాయి అవుట్ పుట్ రాలేదు అనిపించిందట. అందుకే.. ఆ సన్నివేశాల్ని రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈమేరకు నాగచైతన్యాని సంప్రదించగా.. ఆయన కూడా ఒకే అన్నాడని, త్వరలోనే బాగా రాలేని కీలకసన్నివేశాల్ని రీషూట్ చేయడానికి సన్నద్ధమవుతున్నారట. “ప్రేమమ్” తర్వాత నాగచైతన్య-చందు మొండేటిల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో “సవ్యసాచి”పై మంచి అంచనాలే ఉన్నాయి. మాధవన్, భూమికలు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus