Love Story: ‘లవ్ స్టోరీ’ నిర్మాతల ఫైనల్ డెసిషన్ అదేనట..!

  • April 8, 2021 / 07:33 PM IST

నాగచైతన్య- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. నారాయణ్ దాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ రావు లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. దాంతో ఏప్రిల్ 16న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యింది అని రెండ్రోజులుగా ప్రచారం జారుతుంది.

అది నిజమే అని తాజాగా స్పష్టమయ్యింది. ఆహా ఓటీటీ కోసం రానా హోస్ట్ చేస్తున్న ‘నెంబర్ 1 యారి’ ప్రోగ్రామ్ కు ‘లవ్ స్టోరీ’ చిత్ర బృందం విచ్చేసింది.దానికి సంబంధించిన ఓ ప్రోమో కూడా విడుదలయ్యింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరింది. దాంతో థియేటర్ల ఆక్యుపెన్సీని కూడా యాభై శాతానికి కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతుందట.

అందుకే ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ తెలియజేసారు.ఈ పాండమిక్ సిట్యూయేషన్ తొలగిపోయిన తర్వాత తమ సినిమాను విడుదల చేస్తామని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. దీని పై చిత్ర యూనిట్ సభ్యుల నుండీ కూడా అధికారిక ప్రకటన రాబోతుంది. మే 7న ‘లవ్ స్టోరీ’ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus