వేసవి కానుకగా నాగచైతన్య చిత్రం!

ఎన్నో ఆశలు పెట్టుకొన్న “యుద్ధం శరణం” బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడడంతో “ప్రేమమ్”తో తనకు సూపర్ హిట్ ఇచ్చిన చందు మొండేటితో కథ సిద్ధం చేయించుకొని మరీ నాగచైతన్య చేస్తున్న తాజా చిత్రం “సవ్యసాచి”. మాధవన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. భూమిక మరో ముఖ్యపాత్రలో కనిపించనుండడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ చిత్రంలో నాగచైతన్య ఓ టిపికల్ డిజార్డర్ ఉన్న యువకుడిగా కనిపించనున్నాడు.

అయితే.. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 24న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. అలాగే.. నాగచైతన్య కెరీర్ లో మెమోరబుల్ హిట్ గా ఈ చిత్రం నిలవనుందని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఇకపోతే.. నాగచైతన్య ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కబోయే “శైలజారెడ్డి అల్లుడు” కోసం రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో అను ఎమ్మాన్యూల్ కథానాయికగా నటించనుండగా.. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది చైతూ నటించిన రెండు సినిమాలు విడుదలవ్వనుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus