Nagarjuna: మాల్దీవులకు టికెట్లు బుక్ చేసి క్యాన్సిల్ చేశా.. నాగ్ కామెంట్స్ వైరల్!

  • January 13, 2024 / 08:02 PM IST

నాగార్జున నటించిన నా సామిరంగ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండుగకు నా సామిరంగ పర్ఫెక్ట్ మూవీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మాల్దీవులకు తాను టికెట్లను బుక్ చేసుకుని క్యాన్సిల్ చేశానని నాగ్ చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ షో, నా సామిరంగ షూటింగ్ కోసం 75 రోజుల పాటు విశ్రాంతి లేకుండా పని చేశానని ఆయన అన్నారు. నా సామిరంగ మూవీ రిలీజ్ తర్వాత నేను రిలాక్స్ అవ్వాలనుకున్నానని నాగ్ అభిప్రాయపడ్డారు. 17వ తేదీన మాల్దీవులకు వెళ్లాలని టికెట్లు బుక్ చేశానని ఆయన వెల్లడించారు. కానీ ఈ మధ్య టికెట్లు అన్నీ క్యాన్సల్ చేశానని నాగ్ పేర్కొన్నారు, గతంలో నేను చాలాసార్లు మాల్దీవులకు వెళ్లానని నాగార్జున చెప్పుకొచ్చారు.

అయితే ఎవరో ఏదో అంటారని భయపడి మాల్దీవులకు టికెట్లు రద్దు చేయలేదని మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు నచ్చకపోవడం వల్లే ఇలా చేశానని వెల్లడించారు. మాల్దీవుల మంత్రులు మాట్లాడిన మాటలు మంచివి కావని అవి సత్సంబంధాలను దెబ్బ తీస్తాయని నాగార్జున కామెంట్లు చేయడం గమనార్హం. మన దేశ ప్రధానిని ఉద్దేశించి వాళ్లు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని నాగార్జున పేర్కొన్నారు.

300 థియేటర్లలో విడుదల కానున్న నా సామిరంగ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. నా సామిరంగ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా రేంజ్, థియేటర్ల కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నాగ్ (Nagarjuna) తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus