త్రి భాష చిత్రంలో నాగార్జున సరసన నటించనున్న కీర్తి సురేష్!

  • October 4, 2018 / 11:54 AM IST

మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో అనేక ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ ఆమె ఏదీ అంగీకరించలేదు. మహానటి ముందు ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసింది. తమిళంలో విశాల్ సరసన “పందెంకోడి 2” చిత్రంలో నటించగా, చియాన్ విక్రమ్ తో ‘సామి’ అనే చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో సామి 2 విడుదలై తమిళంలో విజయం సాధించింది. పందెంకోడి 2 అక్టోబర్18న విడుదలకానుంది. ఆమె తాజాగా ఓ త్రి భాష చిత్రానికి సైన్ చేసినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రియదర్శన్ “మరక్కర్” అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. కుంజలి మరక్కర్ అనే నేవీ అధికారి కథ ఆధారంగా రూపొందునున్న ఇందులో మోహన్ లాల్,  నాగార్జున, సునీల్ శెట్టి నటించనున్నారు.

ఈ నవంబర్ లో రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముగ్గురు హీరోలు ఫిక్స్ అయిపోయారు. వారి పక్కన హీరోయిన్స్ ఎవరంటే ముందుగా కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఎవరి పక్కన నటిస్తోందని విషయంలో క్లారిటీ రాలేదు కానీ నాగార్జున సరసన నటిస్తుందని చెప్పుకుంటున్నారు. వీరిద్దరి జోడీ ఆకర్షణీయంగా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రియదర్శన్ కుమార్తె, `హలో` బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఓ అతిథి పాత్ర పోషించనుంది. ప్రభు, మేఖేష్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించనున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus