మరో నందమూరి వార్ కు రంగం సిద్దం!

  • April 26, 2017 / 06:00 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించాలి అంటే మా నందమూరి వంశ వారసులకే సాధ్యం అంటారు నందమూరి అభిమాన సైన్యం…అయితే అదే క్రమంలో అటు నందమూరి నట సింహం బాలయ్య…ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ టాలీవుడ్ ను శాసిస్తూ దూసుకుపోతున్న తరుణంలో అనుకోకుండా బాలయ్యకు ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ రోజురోజుకూ పెరిగిపోతూ వస్తుంది…అసలే వ్యక్తిగతంగా వీళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉన్న మాట నిజమే అయినప్పటికీ…దానికి సినిమాలు తోడు కావడంతో ఇప్పుడు ఈ గ్యాప్ మరింత పెరిగేలా కనిపిస్తుంది…విషయంలోకి వెళితే…ఎన్టీఆర్ బాలయ్యకి పోటీగా సినిమాను విడుదల చేసి లేని పోనీ గొడవలు తెచ్చుకోవడానికి ఇష్టపడటం లేదు అంటున్నాయి ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు.

గత ఏడాది జూనియర్ తన ‘నాన్నకు ప్రేమతో’ మూవీని బాలకృష్ణ ‘డిక్టేటర్’ తో పోటీగా విడుదల చేయాడానికి పెద్దగా ఇష్టపడకపోయినా నందమూరి వార్ తప్పలేదు. ఈ నేపధ్యంలో తిరిగి జూనియర్ తన లేటెస్ట్ మూవీ ‘జై లవ కుశ’ ను అనుకోకుండా మళ్ళీ నందమూరి వార్ వైపు నడిపిస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే…ఆగష్టు 11 రిలీజ్ చెయ్యాలి అని అనుకున్న ఈ సినిమా…’జనతా గ్యారేజ్’ను రిలీజ్ చేసిన సెప్టెంబరు 1నే రిలీజ్ చేయాలని జూనియర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెంటిమెంట్ గా ఈ రిలీజ్ డేట్ వల్ల ‘జై లవ కుశ’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని జూనియర్ నమ్మకం అని అంటున్నారు. అయితే అదే నెలలో సెప్టెంబర్ 28న దసరాను టార్గెట్ చేస్తూ బాలకృష్ణ పూరి జగన్నాథ్ ల మూవీ కూడ విడుదల అవుతున్న నేపధ్యం జూనియర్ కు మరొక సమస్యగా మారింది అని టాక్. ఒకవైపు సెంటిమెంట్, మరో వైపు బాబాయితో బాక్స్ ఆఫీస్ వార్ మధ్య పాపం శతమతమైపోతున్నాడు మన ఎన్టీఆర్…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus