Naresh: ఆస్తి కోసం రమ్య నన్ను చంపేయాలనుకుంది… నరేష్ కామెంట్స్ వైరల్!

  • January 27, 2023 / 08:47 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ తరచు తన వ్యక్తిగత కారణాల వల్ల వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రమ్య రఘుపతితో వివాదాల కారణంగా తనకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన ప్రస్తుతం మరొక నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ప్రకటించారు. ఈ విధంగా నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోవాలంటే రమ్య విడాకులు ఇవ్వాల్సి ఉంది

కానీ ఇప్పటివరకు రమ్య విడాకులు ఇవ్వలేదు ఈ విషయం గురించి నరేష్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా నరేష్ కోర్టులో రమ్య గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.2010 సంవత్సరంలో రమ్యకు తనకు వివాహం జరిగిందని 2012లో తనకు కుమారుడు జన్మించారని తెలిపారు. రమ్య నన్ను పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే తనని చాలా ఇబ్బందులకు గురి చేసిందని నరేష్ తెలిపారు. తనకు తెలియకుండా పలుచోట్ల భారీగా అప్పులు చేసిందని నరేష్ తెలిపారు.

ఇక ఆస్తి కోసం ఆమె నన్ను చంపేయడానికి కూడా ప్లాన్ చేసిందని గత ఏడాది ఏప్రిల్ నెలలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి తనపై దాడికి ప్రయత్నించారని నరేష్ తెలిపారు. ఇలా ఆస్తి కోసం పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోందని ఇలాంటి తన వద్ద తన కుమారుడు ఉండకూడదని నరేష్ తెలిపారు. తన కొడుకు గార్డియన్ గా తానే ఉంటానని, రమ్య వద్ద తన కొడుకు ఉంటే తన కొడుకు జీవితం నాశనమవుతుందని నరేష్ తెలిపారు.

ప్రతి ఏడాది తన కొడుకు చదువుల కోసం తాను నాలుగు లక్షల వరకు ఖర్చు చేస్తున్నానని నరేష్ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus