ఒకే సారి నాలుగు సినిమాల గురించి ప్రకటించనున్న ఎన్టీఆర్

  • November 12, 2016 / 02:10 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్‌’ విడుదలై రెండు నెలలు పైనే అవుతోంది. అయినా తారక్ తన నెస్ట్ సినిమాపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అతని సినిమా గురించి రోజుకో వార్త బయటికి వస్తున్నప్పటికీ దీనిపై ఎన్టీఆర్ కానీ, అతని సన్నిహితులు కానీ నోరు మెదపడం లేదు. డైరక్టర్లు, నిర్మాతలు క్యూలో ఉన్నా ఎన్టీఆర్ ఆలస్యం చేయడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

ఎన్టీఆర్ 27వ సినిమాకు డైరక్టర్, నిర్మాత ఎప్పుడో ఫిక్స్ అయ్యారని, ప్రస్తుతం ఆయన కథలను వింటున్నది తన 28, 29, 30 వ సినిమాల కోసమని తెలిసింది. ఈ మూడింటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక చిత్రాన్ని డైరక్ట్ చేయడం పక్కా అని సమాచారం. మిగిలిన సినిమాలకు పూరిజగన్నాథ్, అనిల్ రావిపూడి, చందు మొండేటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలకు సంబంధించిన డైరక్టర్లు, నిర్మాతలు ఫిక్స్ అయిన తర్వాత ఎన్టీఆర్ స్వయంగా ఆ వివరాలను వెల్లడించనున్నారు. అంతా వేగంగా సెట్ అయితే ఈ నెలాఖరున ప్రకటన ఉంటుందని, లేకుంటే క్రిస్మస్ కి ముందు రివీల్ చేయనున్నట్లు తారక్ సన్నిహితులు తెలిపారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus