సూపర్ హిట్ సీక్వెల్ కి తారక్ సెట్ అవుతారా?

  • July 13, 2017 / 06:15 AM IST

కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఆణిముత్యాల్లో సాగర సంగమం ఒకటి. ఇందులో విశ్వ నటుడు కమల్ హాసన్ తన నృత్య ప్రతిభనంతటిని ప్రదర్శించి మెప్పించారు. ఆ తర్వాత సంప్రదాయ నృత్యంపై ఏ హీరో సినిమా చేయలేదు. ఇప్పుడిప్పుడే సాగరసంగమం సినిమాకి సీక్వెల్ చేయాలనీ భావిస్తున్నారు. నేటి తరానికి తగ్గట్లుగా కథను కూడా కంప్లీట్ చేసినట్లు తెలిసింది. ఇందులో హీరోగా నటించే సత్తా నేటి హీరోల్లో ఎన్టీఆర్ మాత్రమే ఉందని చిత్ర యూనిట్ ఫిక్స్ అయిందంట. ఎందుకంటే తారక్ ఏడేళ్ల పాటు కూచిపూడిని నేర్చుకున్నారు. అవలీలగా ఎంతటి నృత్యరూపకాన్ని అయినా వేయగలరు. భరతనాట్యం కూడా టచ్ ఉంది.

సో అతన్ని ఈ చిత్రంలో నటింపచేయించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. మంచి డాన్స్ స్క్రిప్ట్ ఉంటే చేయడానికి ఎన్టీఆర్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ స్టోరీకి తారక్ ఒకే చెబుతారని  ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సాగర సంగమం సీక్వెల్ గురించి ఆ చిత్ర  దర్శకుడు కె విశ్వనాథ్ ని ప్రశ్నించగా ప్రస్తుతానికి తనకు మాత్రం అలాంటి ఆలోచన లేదని తెలిపారు. సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే అది రిస్క్ అని అన్నారు. మరి అంతటి రిస్క్ ని ఎవరు తీసుకుంటారో? త్వరలోనే తెలియనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus