రాజమౌళి మల్టీ స్టారర్ సినిమా అప్డేట్!

  • March 5, 2018 / 08:19 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా యాక్షన్ చిత్రాన్ని తీయడానికి సిద్ధమయ్యారు. అందులో హీరోగా నటించేవారు ఎన్టీఆర్, రామ్ చరణ్ అని అధికారికంగా ప్రకటించకపోయినా ఫోటోతో చెప్పి అందరినీ ఊరించారు. చెర్రీ, తారక్ లతో జక్కన్న బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. వారి ఇద్దరినీ ఒకే చిత్రంలో చూపిస్తే ఆ సినిమా రేంజ్ మామూలుగా ఉండదు. అసలు మెగా, నందమూరి హీరోల కలయికే ఓ క్రేజీ థింగ్. ఆ క్రేజ్ ఉంది కనుకే ఈ చిత్రం గురించి రోజుకో గాసిప్ షికారు చేస్తోంది. తాజాగా రాజ‌మౌళి ఇప్ప‌టికే సినిమా స్క్రిప్టు పూర్తి చేశార‌ని, రామ్‌చ‌ర‌ణ్‌కు వినిపించార‌ని, త్వ‌ర‌లో ఎన్టీయార్‌కు వినిపించ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అందులో అసలు వాస్తవం లేదంట. ఎందుకంటే  స్క్రిప్టు తుది దశలో ఉందని తెలిసింది. ఇది పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్, చరణ్ కి ఒకేసారి వినిపించనున్నారు. అప్పుడు ఇద్దరూ సంతృప్తి చెందితే వర్క్ షాప్ కి వెళుతారు. లేదంటే మరోసారి స్క్రిప్ట్ పనుల్లో కూర్చోనున్నారు. అన్ని పక్కాగా కుదిరిన తర్వాత ఈ సినిమా గురించి మీడియాకి చెప్పాలని రాజమౌళి ఉన్నారు. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ రంగస్థలం కంప్లీట్ చేసి బోయ‌పాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్‌ తో చేసే సినిమా కోసం బిజీగా ఉన్నారు. ఈ రెండు కంప్లీట్ అయిన తరవాత రాజమౌళి సినిమా మొదలుకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus