రౌడీ బేబీ తో శర్వా మరోసారి…?

  • April 13, 2020 / 02:12 PM IST

ఓ హిట్టు కొట్టిన డైరెక్టర్ తోనే వరుసగా సినిమాలు చెయ్యాలని కుర్ర హీరోలే కాదు మీడియం రేంజ్ ఉన్న హీరోలు కూడా ఎగపడుతుంటారు. అలాంటిది 4 రెట్లు బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ కి డిమాండ్ ఏ రేంజ్ లో ఉండాలి. కానీ అలా జరగడం లేదు. ఎవరి గురించి చెబుతున్నానో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కథా. అదేనండీ మన ‘ఆర్.ఎక్స్.100’  డైరెక్టర్ అజయ్ భూపతి గురించి. మొదటి చిత్రంతోనే ఊహ కందని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

‘ఆర్.ఎక్స్.100’ చిత్రం డిస్ట్రిబ్యూటర్ లకు నాలుగు రెట్లు లాభాలను అందించింది. దీంతో ఆయన బిజీ డైరెక్టర్ అయిపోతాడు అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాదాపు ఏడాదిన్నర పై నుండీ ఇతను ఖాళీ గా ఉన్నాడు. ఇప్పటి వరకూ అతని రెండో సినిమా మొదలు కాలేదు. ‘మహాసముద్రం’ అనే కథ తయారు చేసుకుని హీరోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఓ దశలో రవితేజ, నాగ చైతన్య ఈ కథను ఓకే చేసారని వార్తలు వచ్చాయి.

కానీ కొన్ని కారణాల వల్ల వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు శర్వానంద్ ఓకే చేసాడని సమాచారం. కానీ కొన్ని మార్పులు చెప్పాడు అని కూడా తెలుస్తుంది. హీరో ఓకే అయ్యాడు కాబట్టి… హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడట. ఈ క్రమంలో సాయి పల్లవి కి కథ వినిపించాడట. ఆమె ఇంకా ఓకే చెప్పాల్సి ఉంది. ఆమెను ఒప్పించడానికి అజయ్ భూపతి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు అని సమాచారం.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus