సేఫ్ గేమ్లో ‘సైరా’.. ప్రభాస్ కు పెద్ద గండమే..!

  • August 16, 2019 / 02:28 PM IST

తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద విజువల్ ఫీస్ట్ దక్కబోతోంది. ఇప్పటి వరకూ మన టాలీవుడ్ సినిమాలకి అంత దమ్ము ఉందా ప్రశ్నించిన వారికి ‘బాహుబలి’ చిత్రం పెద్ద పంచ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఆ సినిమా ఇన్సిపిరేషన్ తో ఇప్పుడు భారీ బడ్జెట్ తో.. అదే రకమైన పాన్ ఇండియన్ కంటెంట్ తో సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ముందు ఉంది ‘సాహో’ చిత్రం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 30 న విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 10,000 ల స్క్రీన్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 350 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందిందని ప్రభాస్ తెలిపాడు.

ఇక ఈ చిత్రం విడుదలైన 32 రోజులకి మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 వ చిత్రం ‘సైరా’ రాబోతుంది. ఈ చిత్రానికి కూడా 300 కోట్ల పైనే బడ్జెట్ అయ్యిందని సమాచారం. ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా మల్టీ లాంగ్వేజస్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ , నాయన తార వంటి పెద్ద స్టార్లు నటిస్తున్నారు కాబట్టి ఈ చిత్రం సేఫ్ అని ఫిక్సయిపోవచ్చు. కానీ ‘సాహో’ పరిస్థితి అలా కాదు ప్రభాస్ ను మినహాయిస్తే ఒక్క శ్రద్దా కపూర్ వలనే బాలీవుడ్లో భారీ క్రేజ్ ఏర్పడింది. మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో తెలుసుకోవాలి అనే అంటే మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus