పాన్ ఇండియా అంటే ప్రభాస్ వైపు చూస్తున్నారు

  • February 27, 2020 / 03:39 PM IST

బాహుబలి తో ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ జపాన్ వంటి దేశాలలో కూడా ఫ్యాన్స్ ని కలిగివున్నాడు. ఇక బాహుబలి తరువాత ఆయన చేస్తున్న చిత్రాలు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయి. ఆయన గత చిత్రం సాహో ఇండియాలోనే అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో మిక్స్డ్ టాక్ తెచుకొన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 420 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సౌత్ భాషలలో నష్టాలు మిగిల్చిన సాహో హిందీలో మాత్రం హిట్ మూవీగా నిలిచింది. అక్కడ 150కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హిట్ అందుకుంది.

ఇక నిన్న టాలీవుడ్ బడా ప్రొడక్షన్ బ్యానర్స్ లో ఒకటిగా ఉన్న వైజయంతి మూవీస్ ప్రభాస్ తో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కునుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని చెప్పి భారీ రేంజ్ లో తెరకెక్కనుందని హింట్ కూడా ఇచ్చారు. కాగా టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పాన్ ఇండియా మూవీ అంటే ప్రభాసే చేయాలి అనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రభాస్ తో భారీ చిత్రాలు చేయడం సేఫ్ అని వారు భావిస్తున్నారు. ఇక హిందీలో ప్రభాస్ కి మంచి ఫేమ్ ఉందని సాహో ఫలితం నిరూపించింది. కాబట్టి పాన్ ఇండియా ఆలోచన ఎవరికీ వచ్చినా ప్రభాస్ వైపు చూస్తున్నారు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus