త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా టీజర్ రిలీజ్ చేయవద్దన్న పవన్

  • June 16, 2017 / 01:38 PM IST

కాటమరాయుడు తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ కుష్బూ ఓ కీలక రోల్ పోషిస్తోంది. అత్తారింటికి దారేది కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ టీజర్ కూడా సిద్ధమయింది. ఆ టీజర్ రిలీజ్ ని పవన్ అడ్డుకున్నాడని సమాచారం. ఎందుకంటే… హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాని మొదట సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ ఆ నెలలో ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేష్ వస్తుండడంతో రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. ఎటువంటి సీజన్ లేని అక్టోబర్ లో రిలీజ్ చేయాలా? సంక్రాంతికి విడుదల చేయాలా? అని ఆలోచిస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ వల్ల టీజర్ ని రిలీజ్ చేయవద్దని పవన్ త్రివిక్రమ్ కి చెప్పినట్లు తెలిసింది. ఒక సారి సినిమా టీజర్ బయటికి వచ్చిన తర్వాత థియేటర్లోకి ఎప్పుడు వస్తుందనే ఒత్తిడి పెరుగుతుందని చిత్రబృందం అర్ధం చేసుకొని టీజర్ రిలీజ్ ని ప్రకటించకముందే వాయిదా వేసుకుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus