‘పెట్టా’ తెలుగు వెర్షన్ రైట్స్ ను దక్కించుకున్న బాలయ్య ప్రొడ్యూసర్

  • December 19, 2018 / 10:13 AM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా కార్తీక్ సుబ్బ రాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెట్టా’. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రజనీ 165వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్ర విడుదలకు సంబందించిన విషయాలు ఇంకా ప్రకటించలేదు. దీనికి ముఖ్య కారణం తెలుగులో సంక్రాంతి కానుకగా ‘వినయ విధేయ రామా’ ‘ఎన్టీఆర్- కధానాయకుడు’ ‘ఎఫ్2’ వంటి క్రేజీ చిత్రాలు రానుండడంతో థియేటర్స్ దొరకడం కష్టమని భావించి ఈ చిత్రాన్ని తెలుగులో వాయిదా వేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర తెలుగు రైట్స్ ను ఓ ప్రముఖ నిర్మాత దక్కించుకున్నట్టు టాక్. ఆ ప్రముఖ నిర్మాత ఎవరో కాదు ఆ ప్రముఖ నిర్మాత ఎవరో కాదు.. 2018 సంక్రాంతికి బాలయ్య ‘జయసింహ’ చిత్రంతో హిట్టందుకున్న సి.కళ్యాణ్. తెలుగులో రజనీ కాంత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్సీ రేటు పెట్టి సంపాదించాట సి.కళ్యాణ్. త్వరలోనే ఈ చిత్ర తెలుగు వెర్షన్ కు సంబందించిన వివరాలను ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా వంటి క్రేజీ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus