గెస్ట్ హౌస్ వివాదంలో ప్రభాస్, కేసు నమోదు

  • June 9, 2020 / 08:42 PM IST

హీరో ప్రభాస్ పై కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. హీరో ప్రభాస్ తన గెస్ట్ హౌస్ లోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే దీనికి కారణం అని తెలుస్తుంది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్‌లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు.జీవో నెంబర్ 59 కింద దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు కూడా చేసుకున్నాడు.

అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ గతంలోనే శేరిలింగంపల్లి తహసీల్దార్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ యత్నించాడని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూకట్ పల్లి కోర్టులో ట్రయల్ జరగనుంది. గతంలో ఈ గెస్ట్ ని కూల్చి వేయాలని కోర్ట్ ఇవ్వగా, కౌంటర్ పిటీషన్ తో దాని కూల్చివేత ప్రక్రియ నిలిపివేయడం జరిగింది. షూటింగ్స్ లేని సమయంలో ఒంటరిగా గడపడానికి ఇష్టపడే ప్రభాస్ ఎక్కువగా ఆ గెస్ట్ హౌస్ లోనే గడుపుతారని సమాచారం.

తుది తీర్పు వచ్చే వరకు ఆ గెస్ట్ హౌస్ లోకి ప్రభాస్ రాకూడని ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నిబంధలను ఉల్లంగిస్తూ ప్రభాస్ గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించారట. దీనితో రెవెన్యూ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి నిర్మిస్తున్నాయి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus