Pawan Kalyan: పవన్ ఆపితే పూజా హెగ్డే మొదలుపెట్టారా..?

  • May 10, 2021 / 06:21 PM IST

అల వైకుంఠపురములో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే నటిస్తున్న మూడు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వరుస ఆఫర్లతో పూజా హెగ్డే బిజీ అవుతున్నారు. అయితే ఈ హీరోయిన్ ఒక విషయంలో పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా ఫామ్ హౌస్ లో పండించిన మామిడిపండ్లను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు, తన సన్నిహితులకు పంపుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పూజా హెగ్డే సైతం తన తోటలో పండిన మామిడిపండ్లను సినిమా రంగానికి చెందిన వాళ్లకు పంపుతున్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డేకు మంగళూరులో మామిడి తోట ఉంది. ఆ తోటలో పండిన మామిడిపండ్లను పూజా హెగ్డే తన మేనేజర్ ద్వారా ప్రముఖులకు పంపిస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి మామిడి పండ్ల బాక్స్ అందిందని మరి కొంతమందికి రాబోయే రెండుమూడు రోజుల్లో మామిడి పండ్ల బాక్స్ అందనుందని తెలుస్తోంది.

కరోనా విజృంభణ వల్ల పవన్ కళ్యాణ్ గతేడాది నుంచి మామిడిపండ్లను పంపించడం లేదని తెలుస్తోంది. అయితే పూజా హెగ్డే మాత్రం మామిడి పండ్లను పంపిస్తూ ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూజా హెగ్డే పంపించిన మ్యాంగో బాక్స్ ల వల్ల ఎవరైనా కరోనా బారిన పడితే ఆమెపై విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే పూజా హెగ్డే అన్ని జాగ్రత్తలు తీసుకొని మ్యాంగో బాక్స్ లను పంపిస్తున్నారని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus