మొదటి రోజు ఆ సినిమా ఎవరికీ నచ్చలేదు : ప్రభాస్

  • August 13, 2019 / 06:16 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం ఆగష్టు 30 న విడుదల కాబోతుంది. విడుదలకు మరో రెండు వారాలు మాత్రమే టైం ఉండడంతో ప్రమోషన్స్ డోస్ పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే పాటలకి మాత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ చిత్ర దర్శకుడు సుజీత్ తన కాన్సన్ట్రేషన్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ పైనే పెట్టాడని అర్థమవుతుంది. ఇక చిత్రం ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు.

ఈ సమావేశంలో తనకు మొహమాటం, బద్ధకం ఎక్కువ అంటూ ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.ప్రభాస్ మాట్లాడుతూ…. “నాకు మొహమాటం, బద్ధకం చాలా ఎక్కువ. జనాల్లో కూడా కలవలేను. ఈ మూడు నా బలహీనతలు.వీటి నుండీ బయటపడాలని ఎన్నో సార్లు ప్రయత్నించినా మారలేకపోయాను. ఇక నా సినిమా రిలీజ్ రోజు చాలా ప్రెజర్ ఫీలవుతుంటాను. రిలీజ్ రోజు ఎవ్వరినీ కలవను. ఆరోజు ఎక్కువ నిద్రపోతుంటాను. ‘సినిమాకి హిట్ టాక్ వస్తే లేపండి. లేకపోతే వద్దు’ అని నా వాళ్ళకి చెబుతుంటాను.’బాహుబలి ది బిగినింగ్’ రిలీజ్ రోజున కూడా నిద్రపోయాను.ఆ రోజు నన్ను ఎవ్వరూ నన్ను నిద్రలేపలేదు. దాంతో నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది. అయితే నార్త్ నుండీ మంచి టాక్ వచ్చింది. తెలుగు ఆడియన్స్ కి మొదట్లో నచ్చలేదు.. కానీ రెండో రోజు నుండీ క్లిక్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus