చిరంజీవి గారి మెసేజ్ చూసి షాకయ్యాను

  • August 12, 2019 / 12:35 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 30 న విడుదల కాబోతుంది. ఇక రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు ప్రభాస్. ‘సాహో’ చిత్రం గురించి అనేక సంగతులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు మెసేజ్ చూసి షాకయ్యానని ప్రభాస్ చెప్పడం ఆసక్తిగా నెలకొంది.

ప్రభాస్ మాట్లాడుతూ.. ” ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది కాల్ చేశారు. బాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు కూడా మెసేజ్ చేశారు. నా స్నేహితులు అలాగే రాజమౌళి కూడా కాల్ చేసి బావుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే చిరంజీవి గారు నాకు మెసేజ్ చూసి షాకయ్యాను. ట్రైలర్ చాలా బావుందని… అద్భుతంగా కనిపించావని మెగాస్టార్ గారు మెసేజ్ చేసారు. అది చూసిన వెంటనే కాల్ చేశాను. ఆయన అలా మెసేజ్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాను. గూస్ బంప్స్ వచ్చాయి” అంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus