మహేష్ ను దాటాడు కానీ పవన్ కళ్యాణ్ ను దాటలేకపోయాడు

  • August 19, 2019 / 12:34 PM IST

అవును పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డును ప్రభాస్ బ్రేక్ చేయలేకపోయాడట. ఇంతకీ ఏంటా రికార్డు… దేని గురించి.. ? అనేగా మీ డౌట్. విషయంలోకి ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న(ఆగష్టు 18న) రామోజీ ఫిలింసిటీ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు వేలాది మంది జనం తరలివచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రద్దా కపూర్, అరుణ్ విజయ్, మురళి శర్మ లతో పాటు… రాజమౌళి, అల్లు అరవింద్, దిల్ రాజు, వి.వి.వినాయక్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యి ప్రభాస్ కు అలాగే ‘సాహో’ టీంకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు.

ఇదిలా ఉండగా.. ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆన్లైన్ లో 130K మెంబెర్స్ వీక్షించారట. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇంత ఎక్కువ మంది చూడడం ఇది ఒక రికార్డు. అయితే ఈ విషయంలో ప్రభాస్ కంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏకంగా 180K మెంబెర్స్ వీక్షించడం విశేషం. సో ఇప్పటికీ పవన్ కళ్యాణే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పాలి. రెండో స్థానంలో ప్రభాస్ నిలిచాడు. అయితే ‘సాహో’ కి ముందు వరకూ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండో స్థానంలో ఉండేది. ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 126 K మెంబెర్స్ వీక్షించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus