Prabhas: నిర్మాతలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం.. కారణమిదే..?

  • April 9, 2021 / 03:35 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఈ ఏడాది వరుస షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు ఎక్కువగా గ్యాప్ రాకూడదని భావిస్తున్న ప్రభాస్ రెస్ట్ తీసుకోకుండా సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ కెరీర్ ను బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న ప్రభాస్ వచ్చే వారం రాధేశ్యామ్‌ వర్క్‌ ఫినిష్ చేయడానికి హైదరాబాద్ కు వస్తున్నారని తెలుస్తోంది. ఈ నెలలోనే రాధేశ్యామ్ కు గుమ్మడికాయ కొట్టబోతున్నారని సమాచారం. రాధేశ్యామ్ సినిమా వర్క్ పూర్తైన తర్వాత ప్రభాస్ సలార్ సినిమా కోసం గుజరాత్ కు వెళతారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో గుజరాత్ లో వేసిన సెట్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ముఖ్యమైన సీన్స్ ను తెరకెక్కించనున్నారని సమాచారం.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సినిమాల నిర్మాతలపై సీరియస్ అవుతున్నారు. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ లా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నా మేకర్లు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ గురించి, రాధేశ్యామ్ సినిమా పాటలు, ట్రైలర్ కు సంబంధించి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకుని నిర్మాతలు ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తారేమో చూడాలి.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus