ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం పై కేసు నమోదు..!

  • April 22, 2019 / 07:06 PM IST

2011 లో విడుదలైన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభాస్, కాజల్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్ర కథ తనదేనంటూ తాజాగా రచయిత్రి శ్యామలాదేవి కోర్టును ఆశ్రయించారు. ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవలని ఆమె రచించిందట.. దానినే కాపీ కొట్టి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ గా రూపొందించారట. అందుకే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విషయం పై వెంటనే రియాక్ట్ అయిన న్యాయస్థానం వెంటనే ఆదేశాల జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్, మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుకు సమన్లు కూడా పంపారు.

అప్పటినుండీ కోర్టు పరిధిలో ఉన్న ఈ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం ‘నా మనసు కోరింది నిన్నే’ నవలకు కాపీయేనని హైదరాబాద్ సివిల్ కోర్టు నిర్ణయించింది. ఇక ఈ విషయం పై శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ… ” ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రంలోని ప్రతి పాత్ర నా నవల నుండీ కాపీ కొట్టిందే..! అప్పట్లో ఈ విషయం దిల్ రాజుతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన కలిసేందుకు సుముఖత చూపలేదు. అయితే, కోర్టు తీర్పు విషయంలో పూర్తి స్పష్టత, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus