బడా నిర్మాతలని పక్కన పెట్టిన ప్రభాస్!

  • February 27, 2020 / 08:05 AM IST

ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఆ కట్ అవుట్ ది మామూలు ఎట్రాక్షన్ కాదు. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్ వీకెండ్ కే 50 శాతం పైనే రికవరీ అయిపోయే అవకాశం ఈజీగా ఉంది. అంతేకాదు బాలీవుడ్ లో పాపులర్ అయిపోవచ్చు. అది నిర్మాతలైనా … దర్శకులైనా..! మరీ ముఖ్యంగా నిర్మాతలకైతే టేబుల్ ప్రాఫిట్స్ గ్యారంటీ..! అందుకే నిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు చెయ్యడానికి ఎగబడి మరీ అడ్వాన్స్ లు ఇచ్చి కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. అలా కర్చీఫ్ లు వేసుకున్న ఓ ఇద్దరు బడా నిర్మాతలకి పెద్ద షాక్ ఇచ్చాడు ప్రభాస్.

వివరాల్లోకి వెళితే… ‘బాహుబలి’ చిత్రం సెకండ్ పార్ట్ టైములో ‘సాహో’ ‘ప్రభాస్ 20’ పూర్తయ్యాక ప్రభాస్ … ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ లో ఓ చిత్రం చెయ్యాల్సి ఉంది. ఇందుకు గాను మైత్రి వారు ప్రభాస్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇది జరిగి 3 ఏళ్ళు పూర్తయ్యింది. కాని ఇంకా ప్రభాస్ 20 పూర్తవ్వలేదు కాబట్టి.. మైత్రి వారు వెయిట్ చేస్తున్నారు. ఇక వీరితో సినిమా అయ్యాక దిల్ రాజు కూడా లైన్ లో ఉన్నాడు. కాని ఇప్పుడు వీరిద్దరికి ప్రభాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ‘వైజయంతి మూవీస్’ సంస్థలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యాడు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2020 డిసెంబర్లో మొదలుకాబోతుంది. ఈ చిత్రం పూర్దవ్వడానికి 2022 వరకూ టైం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఈ బడా నిర్మాతలు వెయిట్ చేయక తప్పదేమో లేదా 2 సినిమాలు ఏడాదిలో పూర్తి చేసే ఆలోచన ప్రభాస్ కు ఉందేమో.!

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus