టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రభాస్ ను మిస్ అవుతున్నాడే…!

  • January 30, 2021 / 11:12 AM IST

తొలిప్రేమ(2018) సినిమా టైం నుండీ తమన్ మంచి ఫాంలో ఉన్నాడు. అతను ఏ సినిమా చేసినా అది మ్యూజికల్ హిట్ అవుతుంది. అంతకు ముందు వరకూ తమన్ మ్యూజిక్ పై ట్రొల్స్ వచ్చేవి. కానీ ఆ చిత్రం నుండీ ట్రోల్స్ చాలా వరకూ తగ్గాయని చెప్పొచ్చు. ఇక అల వైకుంఠపురములో చిత్రం ఆల్బమ్ తో ఇండియా మొత్తం ఊపేసాడు తమన్. ఆ చిత్రం తరువాత తమన్ తో వర్క్ చెయ్యాలని ప్రతీ స్టార్ హీరో తపన పడుతున్నాడు.

పవర కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోలందరూ తమన్ ను తమ తరువాతి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు.అయితే ఒక్క ప్రభాస్ మాత్రం తమన్ ను ఇంకా దూరం పెడుతూనే ఉన్నాడు. నిజానికి రెబల్ సినిమాకి మొదట తమన్ నే సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ కారణాలేంటో తెలీదు.. ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ నుండీ తమన్ తప్పుకున్నాడు. ఇక సాహో చిత్రానికి కూడా మొదట తమన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు.

కానీ ఓ మేకింగ్ వీడియోకి మాత్రమే తమన్ ను సంగీతం అందించాడు.ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేసే సినిమాకి కూడా ఏ.ఆర్.రెహమాన్ తో పాటు తమన్ ను కూడా సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఫైనల్ గా మిక్కీ. జె.మేయర్ ను ఫైనల్ చేశారు. బహుశా ప్రభాస్ చేసే పాన్ ఇండియా సినిమాలకు తమన్ మ్యూజిక్ వర్కౌట్ అవ్వదని దర్శక నిర్మాతలు కూడా అతన్ని పక్కన పెడుతున్నారు అనుకుంట.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus