సైన్స్ ఫిక్షన్ లో సరికొత్త కోణం..!

  • February 11, 2021 / 05:51 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిషన్ స్టార్ట్ అయ్యిందా అంటే నిజమే అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. అసలు మేటర్లోకి వెళితే, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో ఒక భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీగా ఉంటుందని నాగ్ అశ్విన్ ముందుగానే చెప్పేశాడు. అంతేకాదు, బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్, దీపికా పదుకునే ఈ సినిమాలో నటిస్తున్నారని స్టార్ కాస్టింగ్ ని ముందుగానే ప్రకటించేశాడు.

ఇప్పుడీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టిందట. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి, టైమ్ మిషన్ ని సిద్ధం చేస్తున్నారట మూవీ టీమ్. దీనికి సంబంధించిన అద్భుతమైన సెట్ వర్క్ ని డిజైన్ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం టైమ్ మిషన్ నమూనా సెట్ ని వేశారని, అలాగే, ఒక సైంటిఫిక్ ల్యాబ్ ని కూడా క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. బాలయ్య బాబు ఆదిత్య369 సినిమా సీక్వెల్ సినిమాగా ఇది ఉంటుందని గతంలో వార్తలు వినిపించాయి. ఎందుకంటే, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణ చేస్తుండటంతో అప్పుడు ఈ న్యూస్ వినిపించింది. నాగ్ అశ్విన్ ఆ సీనియర్ దర్శకుడు సూచనలు, సలహాలతో ఇప్పుడు టైమ్ మిషన్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ టైమ్ మిషన్, రీసెర్చ్ ల్యాబ్ లో జరుగుతుండటంతో ఆపనుల్లో బిజీగా ఉందట మూవీ టీమ్. మే 14 తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. మహానటి సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లే ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నారు. నాగ అశ్విన్ ఈసినిమాని కూడా ప్యాన్ ఇండియా మూవీగానే తీస్తున్నారు. ఒకేసారి విదేశీ భాషల్లో కూడా ఈసినిమాని తెరకెక్కించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రెబల్ స్టార్ మిషన్ స్టార్ట్ అయిపోయినట్లే అని అనిపిస్తుంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus