‘ప్రభాస్ 21’ కు మెగాస్టార్ దర్శకుడు..?

  • October 12, 2019 / 03:02 PM IST

ఈ ఏడాది ‘సాహో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ‘సాహో’ తరువాత చిన్న బ్రేక్ తీసుకుని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటునట్టు సమాచారం.

ఇది ప్రభాస్ కు 20 వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం పూర్తయ్యాక ప్రభాస్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా ‘సైరా నరసింహారెడ్డి’ తో చారిత్రాత్మక హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి తో ప్రభాస్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే కదా చర్చలు జరుగుతున్నాయట. ప్రభాస్ ఫైనల్ చేస్తే ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉందట.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus