కొడుకు పెళ్లి కోసం కలిసిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పేరెంట్స్.. పిక్ వైరల్..

  • February 4, 2023 / 02:46 PM IST

ప్రియదర్శన్.. లెజెండరీ డైరెక్టర్.. మలయాళం, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలు తెరకెెక్కించారు. నాగార్జున ‘నిర్ణయం’, బాలయ్య ‘గాంఢీవం’ ఆయన తీసినవే. 19990లో నటి లిస్సీని వివాహం చేసుకున్నారు. వీరికి కళ్యాణి, సిద్దార్థ్ సంతానం. 2016లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇప్పుడు తమ కుమారుడి వివాహం కోసం కలిశారు. తల్లిదండ్రులు, అన్న, వదినలతో కలిసున్న కళ్యాణి పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్, నెటిజన్స్, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. సంప్రదాయ చీర కట్టులో క్యూట్‌గా ఉంది కళ్యాణి. అఖిల్ అక్కినేని ‘హలో’ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసి, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ చేసింది. తమిళ్, మలయాళంలోనూ పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం తన మాతృభాష మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. చూడముచ్చటైన రూపంతో పాటు మంచి టాలెంట్ కలిగిన కళ్యాణి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు అభిమానులను సంపాదించుకుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus